హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తనకు ఎంతో అన్యాయం చేసిందని కాకినాడ ఎంపీ తోట నరసింహులు అన్నారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పని చేసే కుటుంబం తమదని పేర్కొన్నారు. అలాంటి మమ్మల్నే అవమానిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఏపీకి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్తో టీడీపీ కలవడం తనకు నచ్చలేదన్నారు. టీడీపీ తనకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దీనిపై ఎన్నోసార్లు చంద్రబాబును కలిసినా ఫలితం లేదన్నారు. తాను అనారోగ్యంతో ఉన్నా ఎవరూ తనను పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కుట్ర చేసి నన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ ఆదేశిస్తే తాను, తన భార్య ఎన్నికల బరిలో ఉంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa