ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్చూరు సీటు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకే ఖరారు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 01:12 PM

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిల తనయుడు హితేశ్ రాజకీయ రంగప్రవేశానికి శరాఘాతం తగిలింది. పర్చూరు నుంచి తమ రాజకీయ వారసుడిగా హితేశ్ ను బరిలోకి దించాలన్న దగ్గుబాటి దంపతుల ఆశ ఈ దఫా ఎన్నికల్లో తీరేలా కనిపించడం లేదు. హితేశ్ అమెరికా పౌరుడిగా ఉండటం, ఆయన యూఎస్ సిటిజన్ షిప్ ఇంకా రద్దుకాకపోవడంతో, ఈ దఫా ఎన్నికల్లో హితేశ్ ను నిలపలేమని, దానికి బదులుగా పర్చూరు నుంచి మీరే పోటీ చేయాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావును, వైకాపా అధినేత వైఎస్ జగన్ కోరినట్టు తెలుస్తోంది. విదేశీ పౌరులుగా ఉన్న వ్యక్తులు, ఆ పౌరసత్వాన్ని వదులుకున్న తరువాతనే భారత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్చూరు సీటును వెంకటేశ్వరరావుకే ఖరారు చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa