పండ్లలో అతిపెద్ద పండు ‘పనస’. ఈ పండు చెట్లలో పూత జనవరి-మార్చి మధ్య వస్తుంది. పనస చెట్టలో పూత, పిందెలు ఎదిగే దశలో పూత, పిందె కుళ్లు తెగులు, కాయ తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తాయి. బూజు వల్ల వచ్చే పూత, పిందె, కాయకుళ్లు తెగులు మొదట మగపువ్వులను ఆశించి క్రమంగా ఆడ పువ్వులకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశించిన పిందెలు, ఎదిగే కాయలు కుళ్లిపోతాయి.ఐతే ఇది జీర్ణమవడం కాస్త కష్టంగా జరుగుతుంది. ఈ పనసను ఎక్కువగా తింటే నెమ్ము చేస్తుంది. రక్తాన్ని బయటకు పంపే వ్యాధులను కలిగిస్తుంది. అజీర్ణ రోగులకు ఇది మంచిది కాదు. మలబద్ధకాన్ని కలిగిస్తుంది. ఇక పనస చెట్టు పాలను ద్రాక్ష రసంలో కలిపి నూరి పైన పట్టుగా వేస్తే దెబ్బలు తగిలిన వాపులు, నొప్పులు తగ్గిపోతాయి.
![]() |
![]() |