ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్టాఫీస్ కొత్త సేవలు.. ఇక ఇంటి వద్దే ఆ పని పూర్తి

business |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 11:10 PM

భారతీయ తపాలా శాఖ సేవలు దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరుతాయి. కనీసం బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు సైతం ఇండియా పోస్ట్ చేసుకుంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మ్యూచవల్ ఫండ్ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకోసం భారతీయ తపాలా శాఖతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంటున్నట్లు కేంద్ర సమాచార, ప్రచారాల శాఖ తెలిపింది. దీని ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన పలు పనులను ఇంటి వద్ద నుంచే పూర్తి చేసే అవకాశం లభిస్తుందని తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం.


మీరు ఇకపై మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు బ్యాంకుకు లేదా ఏఎంసీల వద్దకు వెళ్లాల్సిన పని లేదు. భారతీయ తపాల శాఖ కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్‌ భాగస్వామ్యంతో ఈ కొత్త సర్వీసులు అందిస్తోంది. ఇకపై మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఇంటి వద్దనే తమ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని ఇండియా పోస్ట్ తెలిపింది. ఈ కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో ముఖ్యంగా వృద్ధులు, మారుమూల గ్రామాల్లోని వారి ఎంతగానో ఉపశమనం ఇస్తుందని చెప్పవచ్చు.


గతంలో యూటీఐ, ఎస్‌యూయూటీఐ కోసం 5 లక్షలకుపైగా కేవైసీ వెరిఫికేషన్లు పూర్తి చేసిన అనుభవం ఇండియా పోస్ట్‌కు ఉంది. ఈ క్రమంలో నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ సైతం తమ ఇన్వెస్టర్లకు సంబంధించిన కేవైసీ పూర్తి చేసేందుకు ఇండియా పోస్ట్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. పోస్టాఫీసు ఉద్యోగులు నేరుగా ఇంటికే వచ్చే కేవైసీ ప్రాసెస్ పూర్తి చేశారు. అవసరమైన డాక్యుమెంట్లను వెరిఫై చేస్తారు. దీంతో ఇన్వెస్టర్లు గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. చాలా ఈజీగా, వేగంగా ప్రక్రియ పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.


జన నివేశ్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఇంటి వద్దే కేవైసీ వెరిఫికేషన్ చేపడుతున్నారు. పెట్టుబడికి సామాన్య ప్రజలను అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిప్పాన్ వర్గాలు తెలిపాయి. ఆర్థిక సేవలు సరిగా లేని గ్రామాల ప్రజలు, వృద్ధులు, సరైన రవాణా సౌకర్యం లేని ప్రాంతాల వారికి ఈ ఇండియా పోస్ట్ కేవైసీ సేవలు ఉపయోగపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుని ఆ ప్రక్రియ గురించి తెలియకపోవడంతో వెనకడుకు వేస్తున్నారో వారు సైతం ఇండియా పోస్ట్ ద్వారా ఈజీగా పెట్టుబడులు పెట్టవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa