ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాను గట్టిగా ఢీకొడుతున్న చైనా.. ఏకంగా 125 శాతం సుంకాలు పెంపు

international |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 10:33 PM

అమెరికా చైనా మధ్య వాణిజ్యం యుద్ధం రోజురోజుకూ ముదురుతూనే వస్తోంది. ఏప్రిల్ 2వ తేదీనే అనేక దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్.. రెండ్రోజుల క్రితమే చైనాపై తప్ప మిగతా అన్ని దేశాలపై సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా డ్రాగన్ దేశంపై మరింత సుంకాన్ని పెంచారు. దీంతో చైనా కూడా తిరిగి పెంచగా.. తీవ్ర కోపోద్రేకానికి గురైన ట్రంప్.. ఆదేశంపై సుంకాలను 145 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే చైనా దీటుగా స్పందించింది. ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. ఆమెరికాపై సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఏప్రిల్ 2వ తేదీ నుంచి ట్రంప్ అనేక దేశాలపై సుంకాలు విధించి వాటిని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా చైనాపై 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం టారిఫ్ వసూలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలోనే చైనా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమెరికాపై సుంకాలను 3 శాతానికి పెంచింది. ఇలా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభం అయింది. డ్రాగన్ దేశం మూడు శాతం పెంచగా.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే 104 శాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా హెచ్చరికలకు ఏమాత్రం జంకని జిన్‌పింగ్.. యూఎస్ ఉత్పత్తులపై 84 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు.


ముఖ్యంగా ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ నష్టపోగా.. ఆయన కాస్త వెనక్కి తగ్గారు. రెండ్రోజుల క్రితమే చైనాపై తప్ప మిగతా అన్ని దేశాలపై సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ చైనాపై మరో 50 శాతం ఎక్కువ టారిఫ్ విధిస్తున్నట్లు చెప్పి.. మొత్తంగా 125 శాతం పన్ను వసూలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. చైనా అధ్యక్షుడు చాలా స్మార్ట్ అని, త్వరలోనే తమ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఫోన్ చేస్తారంటూ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు.


కానీ డ్రాగన్ దేశం మాత్రం ట్రంప్ నిర్ణయాలు, కామెంట్లపై ఏమాత్రం స్పందించక పోయేసరికి.. ట్రంప్ ఆదేశంపై మరోసారి సుంకాలను పెంచారు. ముఖ్యంగా 125 శాతం నుంచి 145 శాతానికి పెంచుతున్న వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. అమెరికా విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపుగా అభివర్ణించారు. అయినా తామేమీ భయపడమంటూ సుంకాలను 125 శాతానికి పెంచి మరోసారి అమెరికాను ఢీకొట్టారు. అలాగే జిన్‌పింగ్.. ఐరోపా యూనియన్ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa