అమెరికాలో హైక్లాస్ వ్యభిచార గృహాలతో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలపై గ్రేడియంట్ సంస్థ సీఈఓ, భారత సంతతికి చెందిన వ్యాపారవెత్త అనురాగ్ బాజ్పాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ గర్ల్స్ కోసం లక్షల రూపాయలు ధారపోస్తున్న బిగ్ షాట్స్ భరతం పడుతుంటే ఈయన కూడా అందులో ఒకరిగా దొరికారని.. బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అధికారులు తెలిపారు. క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడియంట్ సీఈఓగా పనిచేస్తోన్న అనురాగ్ బాజ్పాయ్ వేశ్యా వాటికలో పట్టుబడినట్టు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఆ వ్యభిచార గృహాల్లో గడిపి, ఎక్కువ మొత్తంలో చెల్లించిన క్లైంట్ల జాబితాలో ఆయన పేరు కూడా ఉందని బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఉన్నట్లు పేర్కొంది.
వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన ప్రత్యేక క్లైంట్ల గ్రూప్లో అనురాగ్ పేరు ఉందని విచారణాధికారులు వెల్లడించారు. వీరు ఒకమ్మాయితో ఒక గంటకు 600 డాలర్లు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వీరు ఎంచుకునే వారిలో ఆసియా అమ్మాయిలే ఎక్కువగా ఉంటారని తెలిపారు. ఆ మహిళలు మానవ అక్రమరవాణాతో ఈ ఊబిలో చిక్కుకున్నారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో తమ బాస్ పేరు ఉండటంతో గ్రేడియంట్ సంస్థ సిబ్బంది ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు ఉద్యోగులు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంస్థ మాత్రం అనురాగ్కు మద్దతు ప్రకటించించిది. న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తంచేసింది.
ఎవరీ అనురాగ్ బాజ్పాయ్..?
బోస్టన్లో గ్రేడియంట్ సంస్థను స్థాపించిన వారిలో అనురాగ్ ఒకరు. ఈ సంస్థ మురుగునీటిని శుద్ధి చేస్తుంది. భారత్లో జన్మించిన బాజ్పేయ్ క్లీన్టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఈయన నాయకత్వంలో కంపెనీ సెమీ-కండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, మైనింగ్, ఫుడ్, డ్రింక్స్ వంటి పరిశ్రమలకు సేవలు అందిస్తోంది. కంపెనీ మొత్తం 25 కంటే ఎక్కువ దేశాలలో 2500 కంటే ఎక్కువ వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
ఉత్తర్ప్రదేశ్లోని లక్నోలో పాఠశాల విద్యను పూర్తి చేసిన బాజ్పేయ్ 2006లో మిస్సోరి కొలంబియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఆ తరువాత మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి అడ్వాన్స్డ్ డిగ్రీలు, 2008లో మాస్టర్ ఆఫ్ సైన్స్, 2012లో మెకానికల్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ పూర్తిచేశారు. పరిశోధనల సమయంలో ఈయన పారిశ్రామిక డీశాలినేషన్ & నీటిని శుద్ధి చేయడం వంటి వాటిపై రీసర్చ్ చేశారు. అయితే.. ఇన్ని సాధించిన అనురాగ్.. వేశ్యలపై ఇంత మొత్తంలో ఖర్చు చేసి ఇండియా పరువు తీశాడని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa