ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని లక్ష్మీబాయి కళాశాలలో ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా ఆ కాలేజీలోని అనేక తరగత గదులకు ఎక్కువగా వెంటిలేషన్ లేదు. దీంతో ఎక్కువగా ఉక్కపోస్తుంటుంది. అసలే వేసవి కాలం కావడం.. అందులోనూ ఎండలు మండిపోతుండగా విద్యార్థులు, ఉపాధ్యాయులు నరకం చూస్తున్నారు. తరచుగా దీనిపై ప్రిన్సిపల్కు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. అయితే చల్లదనం కోసం ఆ గదిలో ఏ ఏసీయో, నాలుగైదు ఫ్యాన్లో పెట్టించమంటూ అంతా కోరారు. కానీ ప్రిన్సిపల్ ప్రత్యూష వత్సల మాత్రం ఆ గదని చల్లగా మార్చేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఓ పని చేశారు.
ముఖ్యంగా ఎక్కువ మోతాదులో ఆవుపేడ తెప్పించి వాటిని బకెట్లలో వేశారు. ఆపై అందులో నీళ్లు కలిపి.. వేడిగా ఉండే బ్లాక్ సీలోని క్యాంటీన్ పైన ఉంటే తరగతి గదికి వెళ్లారు. బెంచీలు ఎక్కి మరీ ఆ పేడను గోడలకు పూశారు. అచ్చం రంగులు అద్దినట్లుగా అద్దారు. ఈ సమయంలోనే పలువురు దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధిచిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈక్రమంలోనే దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇలా ఆవు పేడ రాయడం వల్ల గది చాలా చల్లగా ఉంటుందని.. పురాతన కాలంలో ప్రజలంతా మట్టి గోడలకు ఇలాగే పేడ పూసేవారని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరేమో కాలేజీ గోడలపై ఇలా ఆవు పేడ రాయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇదే విషయాన్ని ప్రిన్సిపల్తో ప్రస్తావించగా.. అధ్యాపకుల పరిశోధన ప్రతిపాదనలో భాగంగానే ఈ పని చేసినట్లు చెప్పారు. గది గోడలకు ఆవుపేడ రాయడం వల్ల చాలా చల్లగా ఉంటుందని.. దానికి ఉష్ణోగ్రతను అడ్డుకునే సామర్థ్యం ఉంటుందని వివరించారు. కేవలం భారత దేశంలోని పల్లెల్లోనే కాకుండా ఆఫ్రికన్ కమ్యూనిటీల్లోని చాలా మంది ఇప్పటికీ ఆ పద్ధతిని ఫాలో అవుతున్నాయని చెప్పారు. అలాగే గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం ఆవు పేడతో తయారు చేసిన పెయింట్ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. గోవు పేడ, గోవు మూత్రం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయని ఇప్పటికే రుజువైందన్నారు. ఆరోగ్యం కోసం, యాంటీ బయాటిక్ గాను వాడతారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa