ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ దారుణ ఓటమి,,,గ్రౌండ్‌లోనే ఏడ్చేసిన ఫ్యాన్స్

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 11:36 PM

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీకి బొత్తిగా కలిసి రావడం లేదు. కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోతున్నారు. నిన్న రాత్రయితే ఆల్‌మోస్ట్ ఆర్సీబీ ఫ్యాన్స్ అండర్ గ్రౌండ్‌కి వెళ్లినంత పనయింది. ఐపీఎల్‌ చరిత్రలోనే లీస్ట్ స్కోర్ రికార్డ్ ఆర్సీబీ పేరిట ఉంది. కేకేఆర్‌పై 49 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ అయింది. ఐపీఎల్ 2025లో చిన్నస్వామి స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డును ఆర్సీబీ ఎక్కడి బ్రేక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మ్యాచ్ చూశారు. మొత్తానికి టిమ్ డేవిడ్ దయవల్ల ఆ గండం నుంచి బయటపడేశారు.


వర్షం కారణంగా చాలా ఆలస్యంగా రాత్రి 9:30 గంటల తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మళ్లీ వర్షం పడితే సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్‌కి అది కలిసొచ్చే అవకాశం ఉంది. అందుకే శ్రేయాస్ బౌలింగ్ ఎంచుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు.


14 ఓవర్ల మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మొదటి బంతినే బౌండరీగా మలచడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లారు. 14 ఓవర్లలో ఆర్సీబీ ఇక 200 కొట్టేస్తోంది అని ఫిక్స్ అయిపోయారు. తీరా సీన్ కట్ చేస్తే అతి కష్టం మీద 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. జట్టులోని 11 మంది బ్యాటర్లలో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ స్కోర్స్ చేశారు.


ఫిల్ సాల్ట్ 4 బంతుల్లో 4, విరాట్ కోహ్లి 3 బంతుల్లో 1, లియామ్ లివింగ్‌స్టన్ 6 బంతుల్లో 4, జితేశ్ శర్మ 7 బంతుల్లో 2, కృనాల్ పాండ్యా 2 బంతుల్లో 1, మనోజ్ 4 బంతుల్లో 1, భువనేశ్వర్ 13 బంతుల్లో 8, యశ్ దయాల్ డకౌట్, హేజెల్‌వుడ్ 1 బంతికి సున్నా పరుగులు చేశారు. కెప్టెన్ రజత్ పటిదార్ 18 బంతుల్లో 23, టిమ్ డేవిడ్ 26 బంతుల్లో 50 పరుగులు చేసి ఆర్సీబీ పరువు కాపాడారు.


అయితే ఆర్సీబీ వికెట్లు పడుతుంటే ఫ్యాన్స్‌కు కన్నీళ్లు రాలుతున్నాయి. ఎక్కడ 49 పరుగుల్లోపు ఆలౌట్ అవుతారోనని ఆర్సీబీ డగౌట్స్‌తో పాటు స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా ఏడుపు మొహాలతో కూర్చున్నారు. లేడీ ఫ్యాన్స్ అయితే ఏడ్చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఐపీఎల్ ఫొటోగ్రాఫర్ ఆర్సీబీ లేడీస్ ఫొటోస్‌పై కాన్సన్‌ట్రేషన్ చేసి వాటిని అఫీషియల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.


ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇచ్చిన 96 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు 12.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఛేదించింది. పంజాబ్ మిడిలార్డర్ ఆటగాడు నేహాల్ వధేరా 19 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 33 పరుగులతో రాణించి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హేజేల్‌వుడ్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa