ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యలో రామయ్య దర్శనానికి 80 మీటర్ల సొరంగం: భక్తుల రద్దీ నివారించేందుకు కొత్త మార్గం

national |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 08:39 PM

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని రాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణం ఐదు శతాబ్దాల తర్వాత జరిగిన విషయం తెలిసిందే. దీంతో భక్తులు అయోధ్యకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నరు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సమయంలో అయోధ్య కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు కొత్తగా సొరంగ మార్గం నిర్మించారు. 80 మీటర్ల పొడవు ఉండే ఈ సొరంగం గుండా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు ప్రదక్షిణలు చేయవచ్చు. దేశంలోని ఆలయాల్లో ఇదే అతిపెద్ద సొరంగమని ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ మెహతా తెలిపారు. ఆలయానికి తూర్పు భాగంలో.. నేలమట్టానికి 15 అడుగుల దిగువన ఈ సొరంగం ఉంది. దీని పొడవు 80 మీటర్లు. ప్రదక్షిణ చేసే భక్తులు, ఆలయానికి వచ్చే భక్తులు ఒకే చోట ఉండటం వల్ల రద్దీ ఏర్పడుతుంది. ఈ రద్దీని నివారించడానికి ఈ సొరంగం ఉపయోగపడుతుంది.


ఈ సొరంగం ద్వారా ఒకేసారి లక్ష మందికిపైగా భక్తులు ప్రదక్షిణలు చేయడానికి అవకాశం ఉంటుంది. సుమారు 1.5 లక్షల మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణలు చేయవచ్చని, దేశంలో ఆలయ ప్రదక్షిణ కోసం ఇంత పెద్ద సొరంగం ఎక్కడా లేదని అధికారులు అంటున్నారు. భక్తుల రద్దీని తగ్గించేలా ఈ సొరంగాన్ని ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ మెహతా చెప్పారు. ఈ సొరంగం ఆలయంలో ప్రవేశించేవారికి, ప్రదక్షిణ చేసేవారికి మధ్య రద్దీని తగ్గిస్తుందని ఆయన తెలిపారు.


ప్రదక్షిణ కోసం 800 మీటర్ల పొడవైన గోడను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఈ సొరంగం కూడా ఒక భాగం. అక్టోబరు నాటికి సొరంగం పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. రాముడి జన్మస్థలంలో భవ్యమైన మందిర నిర్మాణం 500 ఏళ్ల హిందువుల చిరకాల స్వప్నం గతేడాది సాకారమైంది. సుదీర్ఘ న్యాయవివాదం అనంతరం 2019 నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అయోధ్యలో మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఆగస్టు 2020లో ఆలయ నిర్మాణానికి శుంకుస్థాపన జరగ్గా.. పనులను శరవేగంగా పూర్తిచేసి 2024 జనవరిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి బాలరాముడి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.


ఇటీవల జరిగిన ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళా సమయంలో అయోధ్యకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. నాలుగు రోజుల్లోనే 65 లక్షల మంది దర్శించుకున్నారంటే రద్దీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. ఇక, శ్రీరామ నవమి రోజున కూడా దాదాపు 20 లక్షల మంది వచ్చారని అంచనా. ఆ రోజున గర్భగుడిలోని బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. రామయ్యకు సూర్యతిలకం దిద్దే ఈ అద్భుత ఘట్టాన్ని కనురాలా తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో రద్దీని నియంత్రించేందుకు యూపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa