ఇప్పటికే పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రెపో రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో ద్వైమాసికంలోనూ వడ్డీ రేట్లను తగ్గించడంతో బ్యాంకులు సైతం సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి ఏదో బ్యాంక్ వడ్డీ రేట్ల కోత ప్రకటన చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఏ బ్యాంకులో డిపాజిట్ చేయాలో తెలియక చాలా మంది తికమకపడుతున్నారు. అయితే, ఇలాంటి పరిస్తితుల్లోనూ ఓ బ్యాంక్ అత్యధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. అదే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.05 శాతం మేర వడ్డీ ఇస్తోంది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఈ నెలలోనే సవరించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను ఏప్రిల్ 16, 2025 నుంచే అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ బ్యాంకులో రూ.3 కోట్ల లోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీ కాల వ్యవధులపై జనరల్ కస్టమర్లకు గరిష్ఠంగా 3.75 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 4.25 శాతం నుంచి 8.05 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. ఇక అత్యధిక వడ్డీ రేటు 8.05 శాతం అనేది 18 నెలల టెన్యూర్ డిపాజిట్లకు అందిస్తోంది.
రూ.5 లక్షలు ఎఫ్డీ చేస్తే ఎంతొస్తుంది?
అధిక రాబడి కోరుకునే వారు అధిక వడ్డీ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు డిపాజిట్ చేయడం మంచిది. ప్రస్తుతం దిగ్గజ బ్యాంకులు వడ్డీ రేట్లు కోత పెడుతున్న క్రమంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సరైన ఎంపికగా చెప్పవచ్చు. ప్రస్తుతం 18 నెలల టెన్యూర్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.05 శాతం వడ్డీ ఇస్తుంది. మరి ఒక సీనియర్ సిటిజన్ ఇందులో రూ.5 లక్షలు జమ చేశారు అనుకుందాం. మెచ్యూరిటీ కాలం 18 నెలల పూర్తయిన తర్వాత 8.05 శాతం వడ్డీ రేటుతో అసలు, వడ్డీ కలిపి మొత్తం చేతికి రూ. 5,58,200 వరకు వస్తాయి. అదే ఒక జనరల్ కస్టమర్ (60 సంవత్సరాల లోపు వారు) రూ.5 లక్షలు జమ చేశాడు అనుకుందాం. అప్పుడు వారికి వడ్డీ రేటు 7.75 శాతం వర్తిస్తుంది. దీని ప్రకారం అసలు, వడ్డీ కలిపి రూ.5,56,000 వరకు అందుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa