ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు.

national |  Suryaa Desk  | Published : Tue, Apr 22, 2025, 07:02 PM

జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ సంఘటనతో పహల్గాంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.వివరాల్లోకి వెళితే, పహల్గాంలోని బైసరన్ వ్యాలీ ఎగువ ప్రాంతంలోని ఒక పర్యాటక రిసార్టు వద్ద ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాల ద్వారా మాత్రమే చేరుకునే వీలుంటుంది. ఇలాంటి ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైనిక తరహా దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, వైద్య బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన పర్యాటకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa