ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయ బుధవారం నాడు నిరసనలతో అట్టుడికింది

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 06:22 AM

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయ బుధవారం నాడు నిరసనలతో అట్టుడికింది. ఈ దారుణ మారణకాండను ఖండిస్తూ లోయ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించారు. గత 35 ఏళ్లలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్‌లో ఇలాంటి సంపూర్ణ బంద్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఈ రక్తపాతాన్ని తీవ్రంగా ఖండించారు. పౌర సమాజ సభ్యులు, వ్యాపార సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, సాధారణ పౌరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. బాధితులకు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి హింసాత్మక చర్యలను ఏమాత్రం సహించరాదని నిరసనకారులు అధికారులను డిమాండ్ చేశారు. శాంతి, న్యాయం, మత సామరస్యానికి కశ్మీరీలు కట్టుబడి ఉన్నారని ఈ నిరసన ప్రదర్శన చాటి చెప్పింది.మరోవైపు, కశ్మీర్‌లోని అన్ని పాఠశాలల్లోనూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం అసెంబ్లీల సమయంలో మరణించిన పర్యాటకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు, సంతాప సమావేశాలు నిర్వహించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa