జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఐఏఎఫ్ కార్పోరల్ టాగే హైలియాంగ్ ప్రాణాలు విడిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గురువారం రోజు ఆయన అంత్యక్రియలు జరగ్గా.. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యంత్రి హాజరయ్యారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తోటి పర్యటకుల ప్రాణాలు కాపాడి చనిపోయిన టాగే హైలియాంగ్ కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల నష్టపరిహారం అందజేస్తామన్నారు. అలాగే అందులో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో భారత వైమానికి దళానికి చెందిన కార్పోరల్ టాగే హైలియాంగ్ ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. దాడి జరుగుతున్న సమయంలో ప్రాణాలకు తెగించి తోటి పర్యటకులను రక్షించేందుకు ఎంతగానో కృషి చేసి చివరకు ముష్కరుల కాల్పుల్లో చనిపోయారు. అయితే ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లోని ఆయన స్వగృహంలో అంత్యక్రియలు జరగ్గా.. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు సైతం హాజరయ్యారు.
టాగే హైలియాంగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర సర్కారు తరఫున రూ.50 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని వివరించారు. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరుగుతుండగా.. భారత వైమానికి దళానికి చెందిన కార్పోరల్ టాగే హైలియాంగ్ ప్రాణాలకు తెగించి మరీ.. పర్యటకులను రక్షించారు. పారిపోయే అవకాశం ఉన్నప్పటికీ తప్పించుకోకుండా తోటి వాళ్లకోసం ముందడుగు వేశారు. చివరకు ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం దాడిలో మృతి చెందగా.. గురువారం రోజు ఆయన మృతదేహం స్వగృహానికి చేరింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లోని తజాంగ్ గ్రామానికి కార్పోరల్ టాగే హైలియాంగ్ పార్థివ దేహం వచ్చింది. ఈక్రమంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఇతర మంత్రులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. టాగే హైలియాంగ్ భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.
కార్పోరల్ టాగే హైలియాంగ్ తోటి పర్యటకులను కాపాడేందుకు చూపిన ధైర్యం, చొరవ.. దేశ చరిత్రలో నిలిచి పోతాయమని ముఖ్యమంత్రి పెమా ఖండూ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని వివరించారు. 2017 నుంచి భారత వైమానికి దళంలో అంకిత భావంతో చేసిన సేవలకు గుర్తింపుగా, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రదర్శించిన ధైర్య సాహసాలకుగాను స్వగ్రామంలో ఆయనకు స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామనన్నారు. అలాగే హైలియాంగ్ కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa