ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో అదరగొట్టి,,,కోహ్లీ మరో హాఫ్ సెంచరీ

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 11:11 PM

రాజస్థాన్ రాయల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్‌లు హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో టిమ్ డేవిడ్‌, జితేశ్ శర్మలు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. కాగా ఐపీఎల్ 2025లో ఆర్సీబీ చిన్నస్వామిలో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకపోవడం గమనార్హం.


ఐపీఎల్ 2025లో సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టే దిశగా బలమైన పునాది వేసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్టు బ్యాటింగ్ చేసి భారీ టార్గెట్ ఫిక్స్ చేసింది. విరాట్ కోహ్లీ, దేవ్‌దత్‌ పడిక్కల్‌లు హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో ఆర్సీబీ.. 200 పైచిలుకు స్కోరు సాధించింది. ఈ టోర్నీలో చిన్నస్వామిలో తొలి విజయంపై కన్నేసింది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్.. ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లలో ఆర్సీబీ టాస్ ఓడిపోవడం ఇది వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. అంతకుముందు మూడు సార్లు కూడా ప్రత్యర్థి జట్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ అదే జరిగింది.


కానీ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది ఆర్సీబీ. ఆ ఉద్దేశాన్ని చాటి చెబుతూ విరాట్ కోహ్లీ.. ఎదురుదాడికి దిగాడు. ఫిలిప్ సాల్ట్ తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేశాడు. బంతిని టైమ్ చేయలేకపోయాడు. చివరకు 23 బంతుల్లో 26 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పడిక్కల్ కూడా 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. దీంతో ఆర్సీబీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.


విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 70 రన్స్‌), పడిక్కల్ (27 బంతుల్లో 50 రన్స్‌) ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన పటీదార్ (1) విఫలమయ్యాడు. చివర్లో టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23 రన్స్‌), జితేశ్ శర్మ (10 బంతుల్లో 20) రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు తీశాడు. ఆర్చర్, హసరంగా ఒక్కో వికెట్ పడగొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa