ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 మీటర్ల వృత్తాకారంలో అమరావతిలో పైలాన్‌ నిర్మాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 12:37 PM

రూ.లక్ష కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేయనున్న దృష్ట్యా అమరావతిలో సభా ప్రాంగణం వెనకనే భారీ పైలాన్‌ని సీఆర్‌డీఏ సిద్ధం చేయిస్తోంది. ఈ పైలాన్‌ శాశ్వత కట్టడంగా అమరావతి రాజధాని చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పైలాన్‌ని ఆవిష్కరించిన తర్వాత మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదాపుగా 50 మీటర్ల వృత్తాకారంలో పైలాన్‌ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఆకే రవికృష్ణ, మల్లికా గార్గ్‌, సర్వశ్రేష్ట్‌ త్రిపాఠి, గుంటూరు ఎస్‌పీ సతీ్‌షకుమార్‌ వంటి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులంతా వెలగపూడిలోనే మకాం వేసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు, వాటికి పార్కింగ్‌ ఏర్పాటు, ప్రజలు కూర్చునే గ్యాలరీ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. గూగుల్‌ శాటిలైట్‌ ఇమేజ్‌లు తెప్పించుకొని ప్రణాళిక రూపొందిస్తున్నారు. భద్రత దృష్ట్యా ఆదివారం నుంచే హెలిప్యాడ్‌, బహిరంగ సభ వేధిక వద్దకు పోలీసు, రెవెన్యూ అధికారులను మినహా ఎవరినీ అనుమతించడం లేదు. బహిరంగ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణ, ఎన్‌టీఆర్‌, ఏలూరు జిల్లాల నుంచి ప్రజలు రానున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాళ్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పెండల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్‌ ప్రదేశాల వద్ద తాగునీరు, మజ్జిగ, భోజనం అందుబాటులో ఉంచుతారు. అలానే తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa