ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులకు పాకిస్తాన్పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలంటూ పవన్ కళ్యాణ్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మీ మోదీకి నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడం చేతకావడం లేదని చామల విమర్శించారు.ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను పవన్ కల్యాణ్ చదువుతున్నారని, 140 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై ఇటువంటి దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక నాయకులు మరింత ఆలోచించి, బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. "ప్రజలు గమనిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్థాయికి తగినట్లుగా వ్యవహరించాలి" అని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa