తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటే ఉంటున్న కొందరు నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."నేను పోతే ఉప ఎన్నిక వస్తుంది, ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని కొందరు ఆశపడుతున్నారు" అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు. తన గెలుపు వెనుక ఎవరి త్యాగాలు లేవని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ఇచ్చిన మ్యాండేట్ తోనే తాను గెలిచానని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని, ఎవరి దయాదాక్షిణ్యాలపైన తాను ఆధారపడలేదని తేల్చి చెప్పారు.నియోజకవర్గంలో అధికారులను ఇబ్బంది పెట్టినా, బెదిరించినా సహించేది లేదని బొలిశెట్టి హెచ్చరించారు. అలాంటి వారి నుంచి అధికారులను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. "నేను పోయాకే మీరు ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను" అంటూ తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa