ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై స్పందించిన హోంమంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 04:24 PM

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ దురదృష్టకర సంఘటనలో ఏడుగురు మరణించారని, వారిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని ఆమె తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa