తమ రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని చెబుతూ.. 21 మంది మణిపూర్ ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రారంభం అయి 3 నెలలు గడుస్తున్నా.. హింస తగ్గించేందుకు ఎలాంచి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రజాదరణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మత సమస్యలు తీరిపోతాయని వెల్లడించారు. అయితే లేఖ రాసిన 21 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ, ముగ్గురు నేషనల్ పీపుల్స్ పార్టీ, మరో ముగ్గురు నాగా పీపుల్స్ ఫ్రంట్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.
2023 మే నెల నుంచి మణిపూర్లో మైతీ, కుకీ తెగల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిరసనల నుంచి హింసాత్మక ఘటనలుగా మారి.. అనేక మంది చనిపోయారు. మొత్తంగా ఈ హింసాత్మక దాడుల్లో 260 మందికి పైగా చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈక్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా రాజ్ భవన్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. దీంతో ఆ రాష్ట్ర్లంలో ఫిబ్రవరి 13వ తేదీన కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.
అయితే రాష్ట్రపతి పాలన విధించి మూడు నెలలు గడుస్తున్నా.. రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం మారలేవని చెబుతూ.. ఆ రాష్ట్రనికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రపతి పాలనను తీసేసి ప్రజాదరణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. అయితే ఈ లేఖ రాసిన వాళ్లలో 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా.. ముగ్గురు నేషనల్ పీపుల్స్ పార్టీ , మరో ముగ్గురు నాగా పీపుల్స్ ఫ్రంట్, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఈ లేఖలో సంతకం కూడా చేశారు.
రాష్ట్రపతి పాలన విధించి నెలలు గడుస్తున్నా.. శాంతి, సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగే అవకాశం ఉందని.. ప్రజలు దీనిపై తీవ్రంగా భయపడుతున్నారని వివరించారు. రాష్ట్రపతి పాలన విధించడాన్ని అనేక పౌర సంస్థలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయని.. నిరసనలు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. అయితే ఈ లేఖ ఏప్రిల్ 10వ తేదీనే రాసినప్పటికీ.. ప్రధాన మంత్రి కార్యాలయానికి ఏప్రిల్ 29వ తేదీన చేరినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa