ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పనస పండును తోలుతో తింటే ఏమవుతుందో తెలుసా....?

Health beauty |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 11:52 PM

వేసవిలో ఎక్కువగా పనసకాయలు దొరుకుతాయి. మార్కెట్లలో, రోడ్ల మీద పనస తొనలు కూడా ఎక్కువగా అమ్మడం చూస్తుంటాం. పనస తొనల్ని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. పనస తొనలు తినడానికి తియ్యగా, ఎంతో రుచిగా ఉంటాయి. పనస తొనలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం పనస తొనలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పనస తొనలు ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.


పనస తొనలతో ప్రయోజనాలు


​పనసకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్లతో పాటు, పనసపండులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, రిబోఫ్లేవిన్, రాగి , మాంగనీస్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు కూడా ఉన్నాయి. జాక్‌ఫ్రూట్ తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పనస తొనలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా పనస తొనలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. పనస పండులో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది సంతృప్త కొవ్వు ఉన్న పండు. పనస తొనలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొందరు మాత్రం పనస తొనలకు దూరంగా ఉండాలి. వాళ్లు ఎవరో తెలుసుకుందాం.


డయాబెటిస్


​డయాబెటిస్ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న పెను ముప్పు. ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. డయాబెటిస్‌తో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక, మధుమేహ రోగులు పనస తొనలు తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పనసపండులో ఉండే యాంటీ-డయాబెటిక్ అంశాలు శరీరంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఒకవేళ తినాలనిపిస్తే మితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


కిడ్నీ రోగులు


మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నవారు పనస తొనలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పనస పండు తినడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా హానికరం. పనసపండు తినడం వల్ల మూత్రపిండాలలో కలిగే సమస్యను హైపర్‌కలేమియా అంటారు. ఇది గుండెపోటు, పక్షవాతానికి కారణమవుతుంది. సాధారణ వ్యక్తులు పనస తొనలు తినడం వల్ల ఏ ప్రమాదం ఉండదు. కిడ్నీ రోగులు తింటేనే ప్రమాదం. ఎందుకంటే పొటాషియాన్ని క్లీన్ చేసే సామర్థ్యం మీ కిడ్నీలకు ఉండదు. దీంతో.. కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువై ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.


అలెర్జీ సమస్యలు


ఈ రోజుల్లో చాలా మంది అలెర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు పనస తొనలకు దూరంగా ఉండటమే మంచిది. బిర్చ్ పుప్పొడి, రబ్బరు పాలుకు అలెర్జీలు ఉన్నవారు పనస పండ్లను అస్సలు తినకూడదు. ఈ వ్యాధి ఉన్నవారిలో పనస పండు తినడం వల్ల అలెర్జీలు పెరుగుతాయి. చర్మంపై దద్దుర్లు, మంట, బొబ్బలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇలాంటి వారు పనస పండు తినకపోవడమే మేలు.


శస్త్రచికిత్స తర్వాత


శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు లేదా ఏదైనా శస్త్రచికిత్సకు ముందు పనస పండు తినకూడదని ఆయుర్వేద నిపుణలు అంటున్నారు. శస్త్రచికిత్స సమయంలో పనస పండు తినడం వల్ల కడుపు నొప్పి, వాపు, జీర్ణ సమస్యలు మొదలైన కడుపు సమస్యలు వస్తాయి. శస్త్రచికిత్స లేదా ఆపరేషన్‌కు రెండు వారాల ముందు పనస తొనలు తినకపోవడమే మేలు.


ప్రెగ్నెన్సీ సమయంలో వద్దు


ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో అత్యంత సున్నితమైన కాలం. ఈ సమయంలో గర్బిణీ స్త్రీలు తినే ఆహారం, తాగే అలవాట్లపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో పనస పండు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పనస పండులో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది తల్లికి, గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికీ హానికరం. అందుకే ఈ సమయంలో తినకపోవడమే మేలు. మీకు ఒకవేళ తినాలనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మేలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa