ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నం పెట్టే రైతులకు ప్రభుత్వం సున్నం రాసింది: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 05:43 PM

 మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి దారుణంగా ఉందని, అన్నం పెట్టే రైతులకు కూటమి ప్రభుత్వం సున్నం పెడుతుంది అంటూ పేర్కొన్నారు. ఒక్క ఎకరానికి ఒక క్వింటాల్ పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయని దుస్థితి నెలకొందన్నారు. వైసీపీ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిగా ఖర్చు చేసి, రూ. 7,796 కోట్లతో మార్కెట్ జోక్యం ద్వారా రైతులను ఆదుకున్నట్లు గుర్తు చేశారు.మిర్చి కొనుగోలు అంశంలోనూ ప్రభుత్వ వైఖరిని జగన్‌ ఎండగట్టారు. “మిర్చి కొనుగోలు నాఫెడ్ చేస్తుందని చెప్పి, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా రైతులను నమ్మబలికి మోసం చేశారు. ఒక్క ఎకరాకు సంబంధించి ఒక్క క్వింటాల్ కూడా కొనకుండా చేతులెత్తేశారు. ఇది వాస్తవం కాదా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పత్తి, మిరప, జొన్న, మినుములు, మొక్కజొన్న, టమాటా, అరటి, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించని పరిస్థితి భయంకరమని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa