పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య సమస్య పూర్తిగా సమసిపోవాలంటే పీఓకేను స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయంగా సూచనలు వస్తుండగా.. దాయాది దేశం సైతం యుద్ధానికి సిద్ధం అవుతోంది. భారత్ను కవ్విస్తూ.. విపరీతంగా రెచ్చగొడుతోంది. ఇలాంటి సమయంలో ఇండియా దౌత్యపరంగా కఠన చర్యలు తీసుకుంటూ వస్తుండగా.. యోగా గురు రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్లు చేశారు. దాయాది దేశం మనతో యుద్ధం చేస్తే.. నాలుగు రోజుల్లోనే పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుందన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మొత్తంగా 26 మంది అమాయక పర్యటకుల ప్రాణాలు తీశారు. అయితే ఇదంతా చేసింది పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులేనని గుర్తించిన భారత్.. ఆ దేశంపై దౌత్యపరంగా కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది. మరోవైపు పాక్.. భారత్కు భయపడి యుద్ధానికి సిద్ధం అవుతుంది. ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో తెలియక నిత్యం నరకం చూస్తోంది. ఇలాంటి సమయంలోనే.. భారత్తో యుద్ధం మొదలైతే దాయాది దేశం వద్ద శతఘ్ని గుండ్లు కేవలం నాలుగు రోజుల్లోనే ఖాళీ అయిపోతాయంటూ ఓ అంగ్ల వార్తా సంస్థ తెలిపింది.
ముఖ్యంగా ఆ దేశం వద్ద అతి తక్కువ స్థాయిలో వీటి నిల్వలు ఉన్నాయని.. పాక్ యుద్ధ రిజర్వులు చాలా వరకు ఉక్రెయిన్కు విక్రయించడంతో నిల్వలు పడిపోయాయని స్పష్టం చేసింది. ఇప్పుడున్న వాటిలో పాకిస్థాన్ యుద్ధం చేస్తే 96 గంటలకు మాత్రమే సరిపోతాయని వివరించింది. దీంతో భారతీయులు అంతా.. దీనిపై స్పందిస్తున్నారు. ఆదేశంపై యుద్ధం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలోనే యోగా గురు రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్లు చేశారు.
ఇప్పటికే అంతర్గత సంఘర్షణలతో దాయాది దేశం.. తనంతట తాను విచ్ఛిన్నం అవుతుందన్నారు. ముఖ్యంగా బలూచ్ ప్రజలు స్వాతంత్ర కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని.. ఆ దేశానికి ప్రస్తుతం పోరాడే శక్తి కూడా లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత్తో యుద్ధం జరిగితే ఈ దేశం నాలుగు రోజులు కూడా నిలవలేదని ఎద్దేవా చేశారు. ఇలా యుద్ధం జరిగితే కచ్చితంగా గెలిచేది మనమే కాబట్టి.. ఆ తర్వాత ఈ చర్యలు తీసుకోవచ్చంటూ వివరించారు.
ముఖ్యంగా పాక్ ఓడిపోయిన తర్వాత ఆదేశంలోని కరాచీ, లాహోర్ ప్రాంతాల్లో గురుకులాలను నిర్మించాల్సి ఉంటుందని బాబా రాందేవ్ పేర్కొన్నారు. పొరుగు దేశం తన సైన్యంపై విశ్వాసం కోల్పోయిందని.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేసే ప్రతీకార దాడుల గురించి ఆ దేశ నాయకులు భయపడుతున్నారని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa