ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన..

international |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 11:55 AM

భారత్-పాకిస్తాన్ దేశాలు యుద్దానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తలు తీవ్రస్థాయికి చేరడం బాధాకరం అని పేర్కొంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలం కానీ, యుద్ధం పరిష్కారం కాదని పేర్కొంది. పొరపాట్లు చేయొద్దని సైనిక చర్యలకు దిగొద్దని రిక్వెస్ట్ చేసింది. ‘ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇలా క్షీణించడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది’ ఆయన అన్నారు. అంతేకాదు, శాంతి కోసం జరిగే ఎలాంటి ప్రయత్నానికైనా ఐక్యరాజ్యసమితి మద్దతు ఇస్తుందన్న హామీ ఇచ్చారు. ‘ఉద్రిక్తతలను తగ్గించి.. చర్చలకు దారితీసే శాంతియుత మార్గాలను మేం ప్రోత్సహిస్తాం. ఇందుకు ఐక్యరాజ్యసమితి సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. పహల్గామ్ దాడితో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు మే 7న 'మాక్ డ్రిల్స్' నిర్వహించాలని ఆదేశించింది. వైమానిక దాడుల సమయంలో సైరన్ల వ్యవస్థ పనితీరు, పౌరులకు సివిల్ డిఫెన్స్ శిక్షణ, అత్యవసర సమయంలో ఎలా రక్షించుకోవాలో ప్రాథమిక అవగాహన, తక్షణ లౌకౌట్ చర్యలు, కీలక స్థావరాలు, పరిశ్రమలు కనిపించకుండా చేయడం వంటివి ఇందులో ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa