ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆపరేషన్ సింధూర్'ను ఆపాలంటూన్న చైనా

international |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 01:59 PM

పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక దళాలు చేపట్టిన దాడుల పట్ల చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా సంయమనం పాటించాలని సూచిస్తూ... భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'ను తక్షణమే నిలిపివేయాలని కోరింది. పొరుగు దేశమైన పాక్ భారత్ దాడులకు దిగడం విచారకరమని చైనా అభిప్రాయపడింది. "ప్రస్తుత పరిస్థితి పట్ల మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. వివాదాన్ని మరింత జఠిలం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని రెండు దేశాలను కోరుతున్నాం" అని బీజింగ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. భారత్ చేపట్టిన సైనిక చర్యలను వెంటనే ఆపాలని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa