'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన దాడుల కారణంగా పాక్ స్టాక్ మార్కెట్ కుదేలైంది. పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ- 100 ఆరంభంలో దాదాపు 5.5 శాతం నష్టంతో 6,272 పాయింట్లు పతనమై 1,07,296 పాయింట్లు చేరింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ నుంచి ఎప్పుడైనా ప్రతిఘటన ఎదురుకావొచ్చన్న అంచనాలతో ఇప్పటికే ఆ సూచీ దాదాపు 3.7 శాతం మేర నష్టపోయింది. ఇది పాక్కు కోలుకోలేని దెబ్బ.సెన్సెక్స్ ఉదయం 79,948.80 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లోనే ప్రారంభమైంది. కాసేపటికే రికవరీ అయ్యింది. 80,844.63 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 30 పాయింట్ల నష్టంతో 80,610 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 5 పాయింట్ల నష్టంతో 24,370 వద్ద ఫ్లాట్గా కొనసాగుతోంది. గత 14 రోజులుగా విదేశీ సంస్థాగత మదుపర్లు 43,940 కోట్లు మేర ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa