పాక్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్యగా ఆయన అభివర్ణించారు. బుధవారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆపరేషన్ సిందూర్ను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.... ‘భారత్లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. కశ్మీర్లోని పహల్గావ్లో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది` అని వైయస్ జగన్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa