ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వార్తలు రాసేటప్పుడు జాగ్రత్త..: మీడియా సంస్థలకు కేంద్రం సూచన

national |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 07:40 PM

సైనిక కార్యకలాపాలు లేదా భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ఉండాలని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని మీడియా సంస్థలకు శనివారం రోజు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలను, సైన్యం చేస్తున్న ఆపరేషన్ల వివరాలను వెల్లడించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపింది. భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే.. వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వివరించింది. అందుకే మీడియా ప్రతినిధులు అంతా వార్తలను సున్నితంగా, బాధ్యాతాయుతంగా కవర్ చేయాలని పేర్కొంది.


కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం రోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలకు సూచనలు జారీ చేసింది. ఇందులో సైనిక కార్యకలాపాలు లేదా భద్రతా దళాల కదలికలపై ప్రత్యక్ష ప్రసారాలు చేయకుండా ఉండాలని వివరించింది. భద్రతా దళాల కదలికలపై వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ సూచనలు జాతీయ భద్రతను పరిరక్షించడానికి, సైనిక కార్యకలాపాలపై అనవసరమైన సమాచారం ప్రసారం కాకుండా చేసేందుకు మాత్రమే జారీ చేసినట్లు కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చెందిన అధికారులు బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతే ఆ సమాచారం గురించి నివేదికలు ఇవ్వాలని పేర్కొంది.


అలా కాదని భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే.. వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందని తెలిపింది. గతంలో కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహపు రిపోర్టింగ్‌కు పాల్పడ్డాయని గుర్తు చేసింది. ముఖ్యంగా కార్గిల్ యుద్ధం, 26/11 ముంబయి దాడులు, కాందహార్ హైజాక్ ఘటనల్లో మీడియా ఇలాంటి తప్పిదాలే చేశాయని పునరుద్ఘాటించింది. కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో.. కేవలం అర్హత ఉన్న అధికారులు మాత్రమే సమయానుసారం బ్రీఫింగ్స్ ఇస్తారని తెలిపింది. వారు ఇచ్చిన సమాచారం మేరకే వార్తలు ఇవ్వాలని.. అప్పుడు కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. మీడియా ప్రతినిధులందరూ సున్నితంగా, బాధ్యాతాయుతంగా వార్తలను కవర్ చేయాలని పేర్కొంది.


ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం సైతం ఆపరేషన్ సిందూర్ వేళ తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లను నిర్వహిస్తోంది. తాజాగా గుజరాత్‌లోని పోర్టు సహా జలంధర్‌లో డ్రోన్, క్షిపణి దాడుల దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో పాక్ అనుకూల వ్యక్తులు వీడియోలు షేర్ చేయగా.. వాటిని భారత్ తిప్పికొట్టింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి మరీ అవన్నీ తప్పుడు వార్తలేనని తేల్చి చెప్పింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa