ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలూచిస్థాన్‌లో చరిత్రాత్మక హిందూ ఆలయం

international |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 11:39 PM

ముస్లిం దేశమైన పాకిస్థాన్‌లో హిందువులు మైనారిటీలు. కానీ అక్కడ కూడా కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఆలయాలు పురాణాలు, చరిత్రపరంగా ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి. ఆకోవకు చెందినదే హింగ్లాజ్ మాతా ఆలయం. అయితే ఇప్పుడు ఈ గుడి పేరు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. బలూచిస్థాన్ వ్యక్తి ఒకరు హింగ్లాజ్ ఆలయం గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ వివరాుల..


మీర్ యార్ బలోచ్ అనే బలూచిస్థాన్ వ్యక్తి.. తాజాగా హింగ్లాజ్ మాత ఆలయానికి సంబంధించిన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. హిందూ సోదర సోదరీమణులు ఈ ఆలయాన్ని సందర్శించాలంటూ పెద్ద ఎత్తున తన వ్యక్తిగతంగా సందేశాలు పంపిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ‘బలూచిస్థాన్‌లోని హింగ్లాజ్ మందిరాన్ని సందర్శించాలనేది 80 ఏళ్ల మా తండ్రి చివరి కోరిక’ అని ఒకరు నాతో చెప్పారు. హింగ్లాజ్ మాతా మందిరం సేఫ్ హ్యాండ్స్‌లో ఉందని నేను భరోసా ఇస్తున్నా. మీరు త్వరలోనే ఈ ఆలయాన్ని సందర్శించొచ్చు, మేం మీకు ఆతిథ్యం ఇస్తాం అని మీర్ యార్ ఎక్స్‌లో పోస్టు చేశారు.


అయితే త్వరలోనే బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా మారుతుందని.. అప్పుడు హిందువులంతా వచ్చి ఆలయాన్ని సందర్శించుకోవచ్చని సదరు వ్యక్తి ట్వీట్ సారాంశం. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం బలూచిస్థాన్‌లో పరిస్థితులు ఉన్నాయి. బలూచిస్థాన్‌లోనిబలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి సాయుధ వేర్పాటవాద గ్రూప్‌లు.. పాకిస్తాన్ సైన్యంపై తరచూ దాడులు చేస్తున్నారు.


ఇక తాజాగా భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్" చేపట్టి పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన సమయంలోనే బీఎల్ఏ రెండు భారీ దాడులు చేసిన పాక్ సైన్యంలో 14 మందిని హతమార్చింది. అంతేకాక బలూచిస్థాన్‌లో ప్రజలు అక్కడ ప్రభుత్వ ఆఫీసులు, భవనాలు, స్మారక చిహ్నాలపై ఉన్న పాకిస్థాన్ జెండాలను తొలగించి.. వాటి స్థానంలో ప్రత్యేక బలోచ్ జెండాలను ఎగురువేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి


దేవి పురాణం ప్రకారం మొత్తం 51 శక్తి పీఠాలుండగా.. వాటిల్లో కొన్ని భారతదేశం వెలుపల కూడా ఉన్నాయి. వాటిల్లో హింగ్లాజ్ మాతా ఆలయం కూడా ఉంది.ఈ గుడిబలోచిస్తాన్ రాష్ట్రంలో హింగోల్ నదీ తీరంలో ఉంది. హింగ్లాజ్ ఆలయం.. భారతదేశం వెలుపల ఉన్న హిందూ దేవాలయం మాత్రమే కాక ప్రపంచంలోని ఐదు పురాతన హిందూ ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.


హింగ్లాజ్ మాత పండుగ ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై, మూడు రోజుల పాటు జరుగుతుంది. లక్షలాది మంది హిందువులు ఈ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక మూడు రోజుల పాటు సాగే హింగ్లాజ్ మాత పండుగలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆ అమ్మని పూజిస్తే.. కోరిన కోర్కెలు నెరవేరుతాయని.. పైగా చేసిన పాపలన్ని తొలగిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com