ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆపరేషన్ సిందూర్‌' విజయంపై మోహన్ భగవత్ హర్షం

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 06:41 AM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' విజయవంతం కావడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్య ద్వారా ఉగ్రవాదులకు గట్టి సమాధానం చెప్పిన భారత సైనిక దళాలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. దేశ భద్రతను కాపాడే క్రమంలో పాకిస్థాన్‌పై కఠిన చర్యలు, అవసరమైతే దాడులు కూడా తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు.కర్ణాటకలోని బెళగావిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఒక హేయమైన, పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందనగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' ద్వారా పాకిస్థాన్‌కు భారత్ సరైన రీతిలో బుద్ధి చెప్పిందని అన్నారు."ఈ ఆపరేషన్, పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేయడమే కాకుండా, దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని ఇనుమడింపజేసింది" అని పేర్కొన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత సైనిక బలగాలు తీసుకుంటున్న అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఇలాంటి క్లిష్ట సమయాల్లో భారతీయులందరూ ఏకతాటిపై నిలిచారని, దేశం మొత్తం సైన్యానికి అండగా ఉందని మోహన్ భాగవత్ అన్నారు. భారత సరిహద్దుల్లోని దేవాలయాలు, పౌర నివాసాలపై పాకిస్థాన్ సైన్యం జరుపుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, దేశ పౌరులందరూ ప్రభుత్వ మార్గదర్శకాలను, హెచ్చరికలను పాటించాలని సూచించారు. ఇలాంటి సమయాల్లోనే దేశ వ్యతిరేక శక్తులు పన్నే కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జాతీయ భద్రతను పరిరక్షించుకోవడానికి పౌరులందరూ సమష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa