ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సైన్యానికి తమవంతు సాయం చేయడానికి మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ముందుకు వచ్చింది

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 06:46 AM

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌కు ధీటుగా సమాధానమిచ్చింది. పాక్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఈ క్రమంలో భారత సైన్యానికి తమవంతు సాయం చేయడానికి మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్  ముందుకు వచ్చింది.ఏఐటీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎల్ ముకాఠి మీడియాతో మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన దాదాపు 7.5 లక్షల ట్రక్కులను భారత సైన్యానికి అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి  లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో రిజిస్టర్ చేసిన ట్రక్కులను  ఉచితంగా సైన్యానికి అందించేందుకు సిద్ధంగా ఉంచామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం ప్రదర్శించే ధైర్య సాహసాల వల్లే ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని ఆయన అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa