గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని మంగళవారం పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యక కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా తనకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు వల్లభనేని వంశీ తెలియజేశారు. తాను మాట్లాడేందుకు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కోర్టుకు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య చికిత్స అందించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మెమో దాఖలు చేయాలని అతడి తరపు న్యాయవాదిని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అదే విధంగా వల్లభనేని వంశీ రిమాండ్ను బుధవారం వరకు కోర్టు పోడిగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa