ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టర్కీ వెళ్తా,,,,అన్నంత పనీ చేసేసిన కేఏ పాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 07:20 PM

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చెప్పినట్లు చేసేశారు. టర్కీ వెళ్తానని చెప్పిన పాల్ అన్నంత ప‌నిచేశారు. భారత్ పాకిస్థాన్ శాంతి చర్చల కోసం టర్కీ వెళ్తానంటూ పాల్ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే పాల్ టర్కీ వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇండిగో సిబ్బంది అడ్డుకున్నార‌ని ఆరోపించిన చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ట‌ర్కీ వెళ్లిన పాల్ అక్కడ మ‌హ‌దీ అనే వ్యక్తితో క‌లిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాట్లాడిన కేఏ పాల్.. పాకిస్థాన్‌కు ట‌ర్కీ మిస్సైల్స్ అమ్మింది నిజ‌మేనని అన్నారు. కానీ అమెరికా పాకిస్థాన్‌కు మిసైల్స్ అమ్మలేదా అంటూ పాల్ ప్రశ్నించారు. మిస్సైల్స్ ఆప‌డానికే తాను ట‌ర్కీ వెళ్లిన‌ట్టు కేఏ పాల్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa