పహల్గాం ఉగ్రదాడితో భారత్ దాయాది దేశంపై ప్రతీకార చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది ఏమాత్రం మింగుడుపడని పాక్ మంత్రులు భారత్పై బెదిరింపులకు పాల్పడ్డారు. అణుబాంబులు వేస్తామని ఒకరు, సింధూ నదిలో తమ నీళ్లైనా పారాలి లేదా భారతీయుల రక్తమైన పారాలంటూ మరొకరు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు పాక్ మాట మార్చింది. మరోసారి కాళ్లబేరానికి వచ్చింది. మన దేశానికి ఓ లేఖ రాస్తూ.. అందులో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దుపై మరోసారి పునఃసమీక్షించుకోవాలని కోరింది.
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు 26 మంది పర్యటకుల ప్రాణాలు తీశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ భారత్.. ఈ దాడి చేసింది పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులేనని గుర్తించింది. దీంతో అటు దౌత్యపరంగా ఇటు సైనిక పరంగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక అప్పటి నుంచి పాకిస్థాన్కు నీళ్లు వెళ్లకుండా చేస్తోంది. అయితే ఈ ఒప్పందం రద్దు తర్వాత పాకిస్థాన్ మంత్రులంతా భారత్పై తీవ్ర విమర్శలు చేశారు.
ముఖ్యంగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్ నీళ్లను ఆపేస్తే తామేమీ ఊరుకోమని, యుద్ధం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఈ నదిపై తమ దేశానికి నీళ్లు రాకుండా చేపట్టే ఏ నిర్మాణాన్ని అయినా బాంబులు పెట్టి పేల్చేస్తామని వివరించారు. అలాగే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి మాట్లాడుతూ.. సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇండియాకు గట్టి బదులిస్తామంటూ హెచ్చరించారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా భారత్ను భయపెట్టే ప్రయత్నం చేశారు.
కానీ ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టగా.. వారి పరిస్థితి వారికి అర్థం అయింది. ఎట్టి పరిస్థితుల్లోనే భారత్తో గెలవలేమని భావించి కాళ్లబేరానికి వచ్చింది. దీంతో భారత్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకే చెప్పింది. కానీ పాక్ పూర్తిగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానేస్తేనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ప్రకటించింది. దీంతో ఇండియా ఎలాగూ వెనక్కి తగ్గేలా లేని అర్థం చేసుకున్న పాక్ మరోసారి కాళ్లబేరానికి వచ్చింది. సింధూ జలాలు నిలిపివేస్తే పాక్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసింది.
ఈ విషయం గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ప్రొటోకాల్లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది. కానీ భారత్ దీనిపై స్పందించే అవకాశమే లేదు. ఎందుకంటే మంగళ వారం రోజే దీని గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించేలని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని పేర్కొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa