ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని కోహ్లీ ప్రకటించాడు. దీంతో అతడిని మరోసారి వైట్ జెర్సీలో చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. కోహ్లీ నిర్ణయం పట్ల అభిమానులు షాక్ అయ్యారు. కోహ్లీకి ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆ లోటును తీర్చేందుకు కోహ్లీ ఫ్యాన్స్ భారీగా ప్లానే చేశారు.
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తర్వాత వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 శనివారంతో పునఃప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ మైదానంలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
టెస్టు క్రికెట్కు కోహ్లీ చేసిన సేవలకు గానూ అతడికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని అతడి ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పేరున్న వైట్ జెర్సీ ధరించాలని డిసైడ్ అయ్యారు. దీనిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. వారి ప్రచారం సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.
మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో వైట్ జెర్సీలు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. స్టేడియం బయట చాలా మంది చిరు వ్యాపారులు.. వైట్ జెర్సీలను విక్రయిస్తూ కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తంగా మ్యాచ్ ప్రారంభమయ్యే నాటికి స్టేడియం మొత్తం వైట్ జెర్సీలతో నిండిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే కోహ్లీకి.. అతడి ఫ్యాన్స్ సక్సెస్ఫుల్గా ఫేర్వెల్ ఇచ్చినట్లే..!
కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇవాళ్టి మ్యాచ్లో గెలిస్తే ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవనుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa