ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాక్ మధ్య చర్చలు లేవు.. భారత ఆర్మీ స్పష్టీకరణ

national |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 12:07 PM

భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)ల మధ్య ఆదివారం (మే 18, 2025) ఎలాంటి చర్చలు షెడ్యూల్ చేయలేదని భారత ఆర్మీ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందానికి ముగింపు తేదీ లేదని, మే 12న జరిగిన ఇరు దేశాల DGMOల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం కొనసాగుతాయని ఆర్మీ వెల్లడించింది. సీజ్‌ఫైర్ ముగుస్తుందన్న వార్తలను కూడా ఆర్మీ ఖండించింది.
ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పగిస్తేనే సింధూ నదీ జలాలను విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa