ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిపక్షం అనేది లేకుండా చెయ్యాలనే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 10:56 AM

ఏపీలో కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ పాలనను సాగిస్తోందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిలో భాగంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేని లిక్కర్‌ స్కామ్‌లను సృష్టించి అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైస్ జగన్ సన్నిహితులపై తప్పడు కేసులు బనాయించి, భయపెట్టాలని అనుకోవడం చంద్రబాబు అవివేకమని అన్నారు. రాబోయేది వైయస్ జగన్ ప్రభుత్వమేనని, ఈ రోజు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ రేపు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అయన మాట్లాడుతూ.... ఏపీ రాజకీయాలను చూస్తే ప్రభుత్వం కొనసాగిస్తున్న అధికార దుర్వినియోగం, అకృత్యాలు, అరాచకాలే కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వపరంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులపై అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నాయకుడిని అణచివేయాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం, ఆఖరికి గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులపైన కేసులు పెట్టించి, జైలు పాలు చేయాలనే దుర్మార్గమైన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం చేతకాక, మళ్ళీ వైయస్ జగన్ ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తారనే భయంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైయస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించే ఛానెల్ లోనే ప్రతిపక్షనేతకు ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతోందని అంగీకరించింది. దీనిని తట్టుకోలేక వైయస్ఆర్‌సీపీ అంటేనే చాలు ఎలా కేసులు పెట్టాలా అనే ఆలోచనలతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు అని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa