ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 03:24 PM

 నకిలీ పట్టాల పంపిణీ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన నూజివీడు కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, గన్నవరంలో నకిలీ పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్ కేసుల్లో ఆయన ఇప్పటికే బెయిల్ పొందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa