యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ తన presence చూపిస్తోంది. కొద్ది కాలం పాటు తగ్గినట్లే అనిపించిన ఈ వైరస్… ఇప్పుడు కొత్త కొత్త వేరియంట్ల రూపంలో మళ్లీ విరుచుకుపడుతోంది. మానవాళిని మరోసారి భయబ్రాంతులకు గురిచేస్తూ, ఆరోగ్య రంగాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఆసియా ఖండంలోని పలు దేశాల్లో కోవిడ్-19 మరోసారి కల్లోలాన్ని సృష్టిస్తోంది. ప్రజలు మాస్కులు, శానిటైజర్లు మళ్లీ వాడడం ప్రారంభించారు. కొన్నిచోట్ల మళ్లీ లాక్డౌన్ వంటి ఆంక్షలు విధించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా భారత్లోనూ మళ్లీ కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది ఇప్పటివరకు పెద్ద సంఖ్య కాకపోయినప్పటికీ, వైరస్ మళ్లీ వ్యాపించే అవకాశాన్ని సూచిస్తుంది.
ప్రజలకు హెచ్చరికలు – తగిన జాగ్రత్తలు అవసరం
ఆరోగ్య నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని, సామాజిక దూరం పాటించడం, హైజీన్ పాటించడం, అవసరమైతే మాస్కులు ధరించడం వంటి సూచనలు ఇస్తున్నారు. గత అనుభవాల నుంచి నేర్చుకుంటూ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం అని అంటున్నారు.
మరోసారి వ్యాక్సినేషన్పై దృష్టి
కేంద్ర ప్రభుత్వం అవసరమైతే బూస్టర్ డోసుల పంపిణీ, కరోనా నిర్ధారణ పరీక్షలు పెంపు వంటి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. వైద్యసేవలు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa