వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యం కేసులో తాను నిర్దోషినని చెబుతున్న జగన్, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గారిలా 'తప్పుంటే ఉరితీయండి' అని ధైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పలేని పరిస్థితిలోనే జగన్ ఉన్నారని షర్మిల ఆరోపించారు.రాష్ట్రంలో మద్యం విధానానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, తాను ఏ తప్పూ చేయలేదని అంటున్నారని షర్మిల గుర్తుచేశారు. "మీరు నిజంగా నిర్దోషి అయితే, మీ తండ్రి రాజశేఖరరెడ్డి గారిలా 'నా తప్పుంటే నన్ను ఉరితీయండి' అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏ విచారణకైనా సిద్ధమని, సీబీఐతోనా లేక సిట్టింగ్ జడ్జితోనా దర్యాప్తు చేయించుకోమని మీరు ఎందుకు ధైర్యంగా చెప్పడం లేదు?" అని షర్మిల నిలదీశారు. అసెంబ్లీ వేదికగా రికార్డుల్లో ఈ విషయాన్ని చెప్పాలని, అలా చెప్పలేకపోవడమే ఆయన తప్పుచేశారనడానికి నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa