ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 03:26 PM

 విజయవాడ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు బాంబు స్క్వాడ్‌ సాయంతో ష్టేషన్‌ మొత్తం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ గాలించారు. ఎక్కడా అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్‌ కాల్‌ను ట్రేస్‌ చేసిన సాంకేతిక సిబ్బంది దానిని ఫేక్‌ కాల్‌గా నిర్ధారించారు.మరోవైపు నగరంలోని బీసెంట్‌ రోడ్డులో ఉన్న ఎల్‌ఐసీ భవనానికి ఇవాళ బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేసి బాంబు పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌ బీసెంట్‌ రోడ్డులోని దుకాణాలను తనిఖీ చేశారు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ ఫోన్‌ చేసింది ఒక్కరేనా? వేర్వేరు వ్యక్తులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa