టీడీపీ కూటమి ప్రభుత్వ దమననీతిని గట్టిగా ఎదుర్కొంటామని అనంతపురం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత ప్రతిపక్షంపై వేధింపులే లక్ష్యంగా పని చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిని అరెస్టు చేయడం, కూటమి ప్రభుత్వ వేధింపులకు పరాకాష్టగా నిలుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వరదాపురంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించాలని తొలుత ఆరోపించి, కాకాణి గోవర్థన్రెడ్డిపై కేసు నమోదు చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కొందరు టీడీపీ నాయకులతో ఆరోపణలు, ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్థన్రెడ్డి కి ముందస్తు బెయిల్ రాకుండా కుట్ర చేశారు. ఆ తర్వాత ఈరోజు ఆయనను అరెస్టు చేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా, యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, టార్గెట్గా పెట్టుకున్న వారిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు.. ఇంకా సోషల్ మీడియా యాక్టివిస్టుల ఎవ్వరినీ వదలడం లేదు. తాము ఏది చేసినా ప్రశ్నించే గొంతు ఉండకూడదన్న కుట్ర, కుతంత్రం, దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. అందుకు యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. కూటమి ప్రభుత్వ తీరును, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం` అంటూ అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa