ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయస్థానాల ఆదేశాల్ని సైతం ప్రభుత్వం తుంగలో త్రొక్కుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 12:51 PM

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాక, నిరుద్యోగ యువతకు శాపంలా మారిందని, కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, అదే పనిగా పలువురు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగిస్తున్నారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్‌ ఆక్షేపించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏపీపీఎస్‌సీ వ్యవహరించినా, ఆ సంస్థ కార్యదర్శిగా పని చేసిన డీజీ స్థాయి అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును దారుణంగా వేధిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగార్జునయాదవ్‌ తెలిపారు.ప్రెస్‌మీట్‌లో నాగార్జునయాదవ్‌ మాట్లాడుతూ..... రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేయడంలో భాగంగానే తమకు నచ్చిన వ్యక్తులను కేసుల్లో ఇరికించడం, నచ్చిన సెక్షన్లు ప్రయోగించడం జరుగుతోంది. దేశ చరిత్రలోనే లేని విధంగా రాష్ట్రంలో డీజీ స్థాయి అధికారిని వేధించడం కోసం ముంబై నుంచి ఒక చిన్న ఆర్టిస్టును తీసుకొచ్చి తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జత్వాని కేసులో పీఎస్సార్‌ ఆంజనేయులును అరెస్ట్‌ చేసిన తర్వాత.. తాను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పని చేసినప్పుడు, ఆ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని కొత్త కథను తయారు చేసుకొచ్చి తద్వారా ఆయనను ఇబ్బంది పెట్టడమే కాకుండా, నిరుద్యోగ యువతలో అనుమానాలు రేకెత్తించే కుట్రలకు కూటమి ప్రభుత్వం తెర తీసింది అని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa