ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్ర లింకుల కేసులో కొనసాగుతున్న దర్యాఫు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 04:46 PM

ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు సిరాజ్, సమీర్‌ను ఐదవ రోజు పోలీస్‌ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని ఎన్‌ఐఏ, కౌంటర్ ఇంటిలిజెన్స్ , ఢిల్లీ ఇంటిజెన్స్ బ్యూరో, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, విజయనగరం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సిరాజ్, సమీర్ జిహాదీలే అని దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. విజయనగరం, హైదరాబాద్, బెంగుళూరు, తమిళనాడులో భారీ పేలుళ్లకు కుట్రపన్నారని తెలుస్తోంది. తన గురించి మరచిపోవాలని జైలు దగ్గర ములాకత్‌లో తన తల్లికి సిరాజ్ చెప్పాడు. ఇప్పటికే సిరాజ్, సమీర్‌లకు అందిన నిధులపై దర్యాప్తు బృందాలు పక్కా ఆధారాలు సేకరించాయి. ముస్లిం మహిళలను వివాహం చేసుకున్న ఇతర మతస్తులను హతమార్చాలి అన్నది సిరాజ్ పథకంలో ఓ భాగమని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అహీం అనే సంస్థతో ఉగ్ర కార్యకలాపాల విస్తృతికి సిరాజ్, సమీర్ స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేశారని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa