ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యారోగ్య శాఖపై మంత్రి సత్య కుమార్ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 03:49 PM

రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన వివిధ విభాగాల అధిపతులతో మంత్రి సత్య కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, పథకాల అమలుపై చర్చించారు. ఉద్యోగుల బదిలీల కోసం పటిష్ఠమైన మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. 
మంత్రి మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణ కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బదిలీల ప్రక్రియలో 100 శాతం పారదర్శకతను నిర్వహించాలని, నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa