ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన నివాసితులకు మేలు చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 01:13 PM

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన PM-JANMAN అద్భుత ఫలితాలనిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పథకం ఫలితంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లక్కవరం నుండి చీడిగొండ వరకు 1.01 కి.మీ. రహదారిని ₹87.19 లక్షల వ్యయంతో నిర్మించామని పవన్ చెప్పారు. ఈ కొత్త రోడ్డు మార్గం ద్వారా చాలా కాలంగా సరైన సౌకర్యాలు లేని 183 మంది గిరిజన నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఇది సాధ్యమైందన్నారు. భారతదేశం అంతటా గిరిజన, PVTG వర్గాల జీవితాలను మార్చే దార్శనికత కలిగిన వ్యక్తి ప్రధాని మోదీ అని పవన్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa