ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 02:56 PM

ఏపీలో రేషన్ పంపిణీ , వాలంటీర్ల తొలగింపుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి  సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారూ అంటూ విమర్శలు చేశారు. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై ఎందుకు కక్ష.. మళ్లీ పేదలకు రేషన్‌ కష్టాలు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి కానీ, వారిని కష్టపెట్టడం సబబేనా.. ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్‌ అవుతుందా అని నిలదీశారు.  వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్‌ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని జగన్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా... పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా అని అన్నారు. పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులు గానూ చిత్రీకరించేలా సీఎం చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాక ముందు ప్రతినెలా ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్‌ సహా ఎన్నో ప్రభుత్వ సేవలకోసం పడ్డ తిప్పలు అన్నీఇన్నీకావని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa