ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్‌బుక్ రాజ్యాంగంలో బడుగు, బలహీన వర్గాలు అల్లాడిపోతున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 12:55 PM

రాష్ట్రంలో మానవత్వంకు మచ్చతెచ్చేలా కూటమి సర్కార్‌ దళిత, మైనార్టీలపై రాజ్యహింసకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పాలన ముసుగులో రాక్షస పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ సృష్టించిన రెడ్‌బుక్ రాజ్యాంగం బూటుకాలు కింద బడుగులు విలవిలలాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ హింసాకాండలో బాధితుల గొంతుగా వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. తెనాలిలో పోలీసుల హింసకు గురైన బాధిత యువకులను మాజీ సీఎం వైయస్ జగన్ పరామర్శించి, వారి పక్షనా ఈ దుర్మార్గంపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa