ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌కు గూఢచర్యం కేసులో మరో యూట్యూబర్‌ అరెస్టు

national |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 12:03 PM

పంజాబ్ రూప్‌నగర్ జిల్లాకు చెందిన యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ను మోహాలీ SSOC అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. "జాన్ మహల్" యూట్యూబ్ ఛానెల్ నిర్వహించే జస్బీర్‌కు PIO షకీర్ అలియాస్ జట్ రాంధావా, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, పాక్ అధికారి డానిష్‌తో సంబంధం కలిగి ఉన్నట్టు తేలింది. జస్బీర్ 3 సార్లు పాక్‌కు వెళ్లి, పాక్ ఆర్మీ అధికారులను కలిశాడు. ఇప్పుడతని ఫోన్‌లో ఉన్న పాక్ నంబర్లపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది.రూప్‌నగర్‌ జిల్లాలోని మహలాన్‌ గ్రామానికి చెందిన జస్బీర్‌ సింగ్‌ను మొహాలీలో స్టేట్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ సెల్‌ అదుపులోకి తీసుకుంది. గూఢచర్యం కేసులో గత నెలలో హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) అరెస్టైన విషయం తెలిసిందే. జ్యోతితో జస్బీర్‌ సింగ్‌కు సంబంధాలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. పాకిస్థానీ నిఘా ఏజెంట్లతో అతడు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa