ఎట్టకేలకు ఆర్సీబీ 18 ఏళ్ల కల నెరవేరింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది.ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది.మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు. ''నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఫైనల్లో ఓడినా మా కుర్రాళ్లు సందర్భానికి తగినట్లుగా ఆడారు. ఈ మ్యాచ్ లో ఓడాల్సింది కాదేమో. గత మ్యాచ్ లో 200 పరుగుల లక్ష్యం సులువుగా చేధించాం. కానీ, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ ను ములుపు తిప్పాడు. అతని అనుభవాన్ని ఉపయోగించి బౌలింగ్ చేశాడు. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు తొలి సీజన్ ఆడారు. అయినా వారు ఫియర్ లెస్ గేమ్ ఆడారు. వచ్చే ఏడాది టైటిల్ గెలిచే ప్రయత్నం చేస్తాం.'' అని శ్రేయాస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa