ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ భద్రత విషయంలో మనం చర్యలు చేపట్టాలి

national |  Suryaa Desk  | Published : Sat, Jun 07, 2025, 12:04 PM

దేశ భద్రత విషయంలో పూర్తిస్థాయిలో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకుగాను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని, పరిశోధనలు ముమ్మరం చేయాలని ఆయన సూచించారు.నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్త వికాస్ వర్గ్ ముగింపు కార్యక్రమంలో మోహన్ భగవత్ ప్రసంగించారు. "పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించి అమాయక పౌరులను అత్యంత కిరాతకంగా చంపారు. ఈ ఘటన పట్ల తీవ్రమైన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం కావడం సహజం. దోషులను కఠినంగా శిక్షించాలన్న బలమైన ఆకాంక్ష వ్యక్తమైంది. ప్రతిగా కొన్ని చర్యలు తీసుకున్నారు. మన సైన్యం ధైర్యసాహసాలు, సామర్థ్యాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం పట్టుదల కూడా కనిపించింది. రాజకీయ వర్గాల్లోనూ పరస్పర అవగాహన వ్యక్తమైంది. సమాజం కూడా తన ఐక్యత సందేశాన్ని ఇచ్చింది. ఇది శాశ్వతంగా కొనసాగాలి" అని భగవత్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa